Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటకలో దారుణ ఘటన-కాబోయే భర్త ఇంట్లో యువతి శవమై..?

crime
, మంగళవారం, 21 నవంబరు 2023 (11:32 IST)
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్త ఇంటిలో యువతి శవమై కనిపించింది. కులం కారణంగా తమ బిడ్డను చంపేసి వుంటారని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే  ఆత్మహత్య చేసుకుందని అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగర జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే ఐశ్వర్య, అశోక్ కుమార్‌లు పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మంచి చదువులు చదివారు. మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఐశ్వర్య దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి.  అశోక్ కుమార్ కుటుంబం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.
 
ఇంకా తల్లిదండ్రులు కఠినమైన షరతులు పెట్టారు. అంతేకాదు, పెళ్లికి కూడా ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఎవరూ రావొద్దని షరతు పెట్టారు. ఇందుకు ఐశ్వర్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. వీరి పెళ్లి నవంబర్ 23వ తేదీన ఫిక్స్ అయింది.
 
పెళ్లికి ముందు జరగాల్సిన తంతు కూడా మొదలైంది. ఇందులో ఐశ్వర్య కూడా పాల్గొంది. కానీ, సోమవారం ఆమె ఉరి తాడుకు వేలాడుతూ కనిపించింది. 
 
ఈ ఘటనపై యువతి తండ్రి సరైన దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ బిడ్డ దళిత కమ్యూనిటీకి చెందిన యువతి కాబట్టి హత్య చేశారని ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబోయే భర్త ఇంటిలో శవమై కనిపించిన నవ వధువు.. ఎక్కడ?