Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంట్లో నలుపు, ఎరుపు రంగు చేపల్ని పెంచితే? (Video)

ఇంట్లో నలుపు, ఎరుపు రంగు చేపల్ని పెంచితే? (Video)
, బుధవారం, 22 జనవరి 2020 (14:56 IST)
దృష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. ఈ పద్ధతులను పాటించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శుభకార్యాల్లో అరటి చెట్లను ఇంటి ముందు వుంచడం చూస్తుంటాం. అరటి పువ్వులు కాయలతో కూడిన అరటి చెట్లకు దృష్టి దోషాలను లాగేసుకునే శక్తి వుంటుందట.

అందుకే శుభకార్యాల్లో అరటి చెట్లను ఇంటి ముందు కడుతారని విశ్వాసం. ఇంటికి వచ్చే కొందరి దృష్టి సరిగ్గా వుండకపోవచ్చు. వారి ఆలోచనలు ప్రతికూలంగా వుండవచ్చు. అలాంటి వాటితో ఉత్పన్నం అయ్యే సమస్యలను తొలగించుకునేందుకు అరటి చెట్లను ఇంటి ముందు వుంచుతారు. 
 
ఇలాగే దృష్టి దోషాలను తొలగించుకోవాలంటే.. గృహంలో చేపల తొట్టెను వుంచడం చేయొచ్చు. అందులో నలుపు, ఎరుపు రంగు చేపలను పెంచడం చేయొచ్చు. కంటి దృష్టికి చెక్ పెట్టాలంటే.. ఇంట్లో సునితమైన మంగళవాద్యాల శబ్ధాన్ని ఎప్పుడూ వినిపించేలా చేయొచ్చు. కంటి దృష్టిని పోగొట్టే వినాయకుని బొమ్మను వుంచవచ్చు. ఇంకా ఇంటికి ప్రధాన ద్వారం వద్ద కలబంద, బ్రహ్మజెముడు మొక్కలను వేలాడదీయడం చేయొచ్చు. 
 
అలాగే ఈ చెట్లను ఇంటి ముందు పెంచడం ద్వారా దృష్టి లోపాలుండవు. వారానికి ఓసారి ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది. ఇంటిని కూడా ఉప్పు, పసుపు నీటితో కలిపి శుభ్రం చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలు దూరమవుతాయి. అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయడం మరిచిపోకూడదు.

సాంబ్రాణి వేసేటప్పుడు తెలుపు ఆవాలను మరిచిపోకూడదు. తెలుపు ఆవాలతో సాంబ్రాణి వేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి వుంటుంది. ఇంకా ఇంట అష్టైశ్వర్యాలు తులతూగుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-01-2020 బుధవారం మీ రాశి ఫలితాలు.. (video)