Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనరాబడి.. ఆదాయం కోసం.. మహిళలు ఎడమచేతిలో?

ధనరాబడి.. ఆదాయం కోసం.. మహిళలు ఎడమచేతిలో?
, ఆదివారం, 27 జనవరి 2019 (18:42 IST)
ధనరాబడి, ఆదాయం కోసం ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అవేంటంటే..? ఆవు మూత్రాన్ని రోజూ స్నానం చేసే నీటిలో ఒక గ్లాసు పోసుకుని స్నానం చేయడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
45 రోజుల పాటు గోవు మూత్రాన్ని ఇంటిల్లపాది చల్లుతూ శుభ్రం చేసకుంటే.. ఆదాయం వుంటుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. శుభ ఫలితాలు వుంటాయి. పెసళ్లను నీటిలో నానబెట్టి.. అందులో బెల్లం కలిపి మరుసటి రోజు పక్షులకు ఆహారం పెడితే.. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ధన రాబడి వుంటుంది. మహిళలు ఎప్పుడూ తమ ఎడమ చేతిలో వెండి ఉంగరాలను ధరించడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
అలాగే ఆవు పెరుగును శరీరం మొత్తం రాసుకుని.. స్నానం చేయడం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. పెసళ్లను ఓ పచ్చని సంచిలో మూటకట్టి... నిద్రించేటప్పుడు తలదిండు కింద వుంచి నిద్రించి.. మరుసటి రోజు ప్రవహించే నీటిలో వదలడం ద్వారా.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరువనంతపురం శ్రీ మహావిష్ణువు మహిమ ఏమిటో తెలుసా?