Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?

శ్రీ వేంకటేశ సుప్రభాతం విశిష్టత ఏమిటి?
, మంగళవారం, 10 ఆగస్టు 2021 (22:03 IST)
భూలోకవైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వెలిసిన జగత్ ప్రసిద్ధమైన ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ స్వామి వారికి సుప్రభాతం తెలుపుతూ ఆయన గుణగణ చేష్టితాలను కీర్తించే 70 శ్లోకాలున్న లఘుకృతి శ్రీ వేంకటేశ సుప్రభాతం.
 
దీనిని మనవాళ మహాముని రచించారు. ఒక్క ధనుర్మాసంలో తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ ఉషఃకాలంలో జరిగేది ఇదే. దీని పఠనా కాలం సుమారు 20 నిమిషాలు.
 
ఇందులో ప్రధాన వస్తువు శ్రీవారి దివ్యవైభవాన్ని ప్రశంసించడమే. ఇందులో సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం వున్నాయి. ఇది వైష్ణవ సంప్రదాయ సంబంధమైనది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగస్టు 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి, 30న శ్రీకృష్ణాష్టమి