Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలి ఏకాదశి... పేలాల పిండి తినడంలో పరమార్థం ఏమిటి...?

తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందిక

తొలి ఏకాదశి... పేలాల పిండి తినడంలో పరమార్థం ఏమిటి...?
, శుక్రవారం, 15 జులై 2016 (13:55 IST)
తొలి ఏకాదశితో హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి. తెలుగు వారి పండుగల్లో ప్రతి పండుగకు ఒక విశేష వంటకం ఉంటుంది. తొలి ఏకాదశి పండుగ నాడు అందరూ పేలాపిండి తినడం ఆచారం. ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు. కానీ ఈ పిండి విశేషం చాలా మందికి తెలియదు. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారుచేస్తారు. 
 
పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల తొలి పండుగ దినాన వారిని గుర్తుచేసుకోవడం అనేది ఇందులో ఉన్న ప్రధాన అంశం. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అంతకు మించి శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పద్మావతి'ని ఘాట్‌ రోడ్డులో నడిపించారు... చిరుత వచ్చి దాడిచేసి వుంటే..?