Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ చెట్టును పూజిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

ఈ చెట్టును పూజిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?
, శుక్రవారం, 28 డిశెంబరు 2018 (14:08 IST)
హిందూ మతంలోని ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీ దేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. అంతేకాదు సరస్వతి చెట్టు జ్ఞానాన్నికూడా ప్రసాదిస్తుంది. ఎన్నోఅద్భుతమైన గుణాలు కలిగియున్న ఈ చెట్టును ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తున్నారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఆ ఆకు యొక్క ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
 
ఇంట్లో ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగి శుభం చేకూరుతుంది. ఈ ఆకులతో సరస్వతీ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. తరచు ఈ ఆకులతో పూజలు చేస్తుంటే.. ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో వెల్లువిరుస్తుంది. అన్ని విఘ్నాలు తొలగి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. శనిగ్రహదోషాలతో బాధపడేవారు.. ఈ చెట్టును ఆరాధిస్తే చాలంటున్నారు పండితులు. 
 
ఈ చెట్టు ఆకులను విద్యార్థులకు పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు. ఈ ఆకుల రసం పచ్చకామెర్ల వ్యాధిని నివారించడంలో తోడ్పడుతుంది. మెదడు సంబంధిత వ్యాధులను నివారించడంతో అద్భుతంగా పనిచేస్తుంది. మేధా శక్తిని పెంచుతుంది. రకాన్నిశుద్దీకరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గృహ నిర్మాణానికి.. దిక్కులు - మూలలు..?