Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోతులూరి బ్రహ్మంగారు చెప్పినవి జరిగినవి...

పోతులూరి బ్రహ్మంగారు చెప్పినవి జరిగినవి...
, సోమవారం, 4 ఏప్రియల్ 2016 (16:50 IST)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళ పత్ర గ్రంధాలలో రచించి భద్రపరచారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన ముందే చెప్పారు..
ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్నవి:
* నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు (విద్యుత్ శక్తి) (నీటితో జనరేటరు)
* ఎద్దులు లేకుండానే బళ్ళు నడుస్తాయి. (యంత్ర వాహనాలు)
* కాశీ పట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది.
* ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంధీ)
* తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (ఎన్.టి.ఆర్, జయలలిత, ఎంజిఆర్ తదితరులు. చలన చిత్రాలు)
* రాచరికాలు,రాజుల పాలనా నశిస్తాయి. (ప్రజా ప్రభుత్వాలు)
* ఆకాశాన పక్షివాహనాలు కూలి అనేకమంది మరణిస్తారు. (విమాన ప్రమాదాలు)
* జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
* బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
* దేవస్థానాలు పాపాత్ముల వలన నాశనమౌతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి.
* చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు. సృష్టిని మార్చటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు.
* రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి.(శ్రీలంకలోని తీవ్రవాద పణామాలు)
* గట్టివాడైన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు.(లాల్ బహుద్దూర్ శాస్త్రి)
* కపట యోగులు విపరీతంగా పెరిగి పోతారు. వీరివలన ప్రజలంతా మోసపోతారు.
* అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.

Share this Story:

Follow Webdunia telugu