Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిషేధం ఈనాటికి కాదు... 200 యేళ్ళ నాటిది..

నిషేధం ఈనాటికి కాదు... 200 యేళ్ళ నాటిది..
, శుక్రవారం, 23 నవంబరు 2018 (11:19 IST)
శబరిమల అయ్యప్ప పుణ్యక్షేత్రంలోకి మహిళల ప్రవేశంపై సాగుతున్న నిషేధం ఇప్పటిది కాదనీ 200 యేళ్ళనాటిదని బ్రిటిష్‌ కాలం నాటి సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆలయంలోకి 10-50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న విషయం తెల్సిందే. ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. దీంతో కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అయ్యప్ప భక్తులు అడ్డుకుంటున్నారు. ఫలితంగా వివాదం చెలరేగుతోంది. 
 
ఈ నేపథ్యంలో అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధం 200 ఏళ్ల క్రితం కూడా అమలులో ఉన్నట్లు బ్రిటిష్‌ కాలం నాటి సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. బెంజమిన్‌ స్వైన్‌, పీటర్‌ ఇరే కానర్‌ అనే ఇద్దరు బ్రిటిష్‌ సైనికాధికారులు ఈ అంశంపై విస్తృత అధ్యయనం నిర్వహించారు. ఐదేళ్ల పాటు కూలంకషంగా అధ్యయనం నిర్వహించిన వీరు 1820లో ఆ వివరాలను సంకలనం చేశారు. 
 
వృద్ధులైన మహిళలు, చిన్నవయసు బాలికలు ఆలయానికి వెళ్లవచ్చని, రుతుక్రమం కొనసాగుతున్న వయసు మహిళలకు ప్రవేశం నిషిద్ధమని ఆ సైనికాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఎం.జి.శశిభూషణ్‌ అనే చరిత్ర కారుడు రెండు సంకలనాలుగా ప్రచురితమైన ఈ నివేదికను ఖచ్చితమైన చారిత్రక పత్రంగా పేర్కొన్నారు. 
 
1991లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సదరు నిషేధానికి చట్టబద్ధత లభించినట్లు తెలిపారు. 1994లో ఈ నివేదికలను కేరళ గెజిట్‌ విభాగం తిరిగి ప్రచురించింది. సైనికాధికారులు తమ పరిశోధన నివేదికలో శబరిమల ఆలయాన్ని చౌరీముల్లా షస్ట(అయ్యప్ప)గా పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

23-11-2018 శుక్రవారం దినఫలాలు - లౌక్యంగా వ్యవహరించడం వల్ల...