Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓంకార నాదం వినిపించే సోమేశ్వర లక్ష్మీ నర‌సింహేశ్వరాలయం

వరంగల్లు జిల్లా పాలకుర్తిలో అంటే స్టేషన్ ఘనాపూర్‌కు 23 కిలో మీటర్ల దూరంలో పర్వతాగ్రం మీద స్వయంభు సోమేశ్వర గుహాలయం, శ్రీ లక్ష్మీ నరసింహేశ్వర గుహాలయం ప్రక్కప్రక్కనే ఉండటం విశేషం. ఈ క్షేత్రాన్ని’’ క్షీరాద్రి’’ అంటారు.

ఓంకార నాదం వినిపించే సోమేశ్వర లక్ష్మీ నర‌సింహేశ్వరాలయం
, బుధవారం, 3 ఆగస్టు 2016 (21:52 IST)
వరంగల్లు జిల్లా పాలకుర్తిలో అంటే స్టేషన్ ఘనాపూర్‌కు 23 కిలో మీటర్ల దూరంలో పర్వతాగ్రం మీద స్వయంభు సోమేశ్వర గుహాలయం, శ్రీ లక్ష్మీ నరసింహేశ్వర గుహాలయం ప్రక్కప్రక్కనే ఉండటం విశేషం. ఈ క్షేత్రాన్ని’’ క్షీరాద్రి’’ అంటారు.
 
’’క్షీరాద్రి శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే ‘’ అని ఇక్కడి నానుడి. పూర్వం ఇది తపో భూమి. అర్థ రాత్రి ఆలయ గుహల నుండి ‘’ఓంకార నాదం’’ వినిపించి తన్మయుల్ని చేయటం మరో విచిత్రం. ఇక్కడి సోమేశ్వరుడిని అర్చిస్తే లక్ష రెట్ల అధిక ఫలితం వస్తుందని అచంచల విశ్వాసం. శివకేశవులకు భేదం లేదని తెలియజెప్పే క్షేత్రం ఇది. నరసింహ స్వామి గుహ నుండి ఉద్భవించే నీటి పాయ కొండ మీది కోనేటి నుంచి అంతర్వాహినిగా ప్రవహించి ఈ గ్రామంలోని చెరువును చేరి ‘’పాలేరు‘’గా మారి చివరికి గోదావరి నదిలో సంగమిస్తుంది.
 
పాలేరు పుట్టిన చోటు కనుక ‘’పాలకుర్తి’’ అయింది. శివ కవులలో ముఖ్యుడైన పాలకుర్తి సోమనాధుడు ఇక్కడి వాడే. శ్రావణ మాసంలో అయిదు రోజులు సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి లక్ష కుంకుమార్చన, నరసింహ స్వామికి లక్ష తులసీదళ పూజ, లోకకల్యాణం కోసం ‘’రుద్ర స్వాహా కార పూర్వక శత చండీ యాగం ‘’జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాహుబలి-2కు భారీ క్రేజ్‌.. ట్రెయిలర్ రైట్స్... రూ.44 కోట్లా...?