Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజా.. నీకెందుకు తల్లీ.. ఈ దుస్థితి.. ఇప్పటికైనా తేడా తెలుసుకో..?

రోజా.. నీకెందుకు తల్లీ.. ఈ దుస్థితి.. ఇప్పటికైనా తేడా తెలుసుకో..?
WD
తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన ప్రముఖ నటి రోజాపై ఆ పార్టీ నేతలు నోరు విప్పారు. టీడీపీలో సముచిత స్థానం కల్పించిన రోజాకు టైం బాగోలేదని.. అందుకే ఎమ్మెల్సీ గంగా భవాని వంటి వారు రోజాను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం నేత పీఎల్ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి రోజాను స్వయంగా ఆహ్వానించి తీసుకున్నా ఆమెకి అవమానాలు తప్పడం లేదని పీఎల్ అన్నారు.

తెలుగుదేశం పార్టీలో ఆమెను చాలా గౌరవంగా చూసుకునేవారని, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్తుంటే.. ఎమ్మెల్సీ గంగాభవాని లాంటి వారి నోళ్లలో రోజా నానుతుందని పీఎల్ వెల్లడించారు. ఇప్పటికైనా.. రోజాకు టీడీపీకి, కాంగ్రెస్‌కు తేడా ఏమిటో? తెలిసి ఉండాలని ఆయన తెలిపారు.

మరోవైపు రోజాకు టీడీపీలో సముచిత స్థానం కల్పించి రెండుసార్లు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి తగిన గుర్తింపు కల్పించినా నిలబెట్టుకోలేకపోయిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

ఇకపోతే.. సినీ నటి అయిన రోజా రాజకీయ భవిత ఏమిటో ఇంకా అవగతం కాలేదని.. తెలుగుదేశం పార్టీకి స్వస్తి చెప్పిన తరహాలోనే రోజా తన రాజకీయ జీవితానికి కూడా స్వస్తి చెబుతుందేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు.. రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి సినిమాలో అడపాదడపా పాత్రలు చేసుకుంటుందనుకుంటే.. సినిమా వాళ్లపై కూడా రోజా చేసిన విమర్శలు అంతా ఇంతా కాదని.. అక్కడ కూడా ఆమెకు ఎదురుదెబ్బ తగులుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రోజా.. గోడపై పిల్లిలా ఏ వైపు దూకుతుందో? వేచి చూడాల్సిందే..!.

Share this Story:

Follow Webdunia telugu