Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెన్సెక్స్ బుల్ దూకుడు.. 60 వేల మార్క్‌ను దాటేసింది..

సెన్సెక్స్ బుల్ దూకుడు.. 60 వేల మార్క్‌ను దాటేసింది..
, శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (11:03 IST)
భారత స్టాక్ మార్కెట్ల చరిత్రలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 60 వేల పాయింట్ల మైలు రాయిని దాటింది. దీంతో మన మార్కెట్ల చరిత్రలో సెప్టెంబర్ 24వ తేదీన దేశ చరిత్రలో ఒక మరుపురాని రోజుగా నిలిచిపోయింది. అలాగే, నిఫ్టీ సైతం దూకుడు ప్రదర్శించింది. ఫలితంగా 18 వేల మార్కును టచ్ చేసే దిశగా పరుగులు పెడుతోంది. 
 
మరోవైపు, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నప్పటికీ భారత మార్కెట్లు మాత్రం జోష్‌లో కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియడం మన మార్కెట్లలో ర్యాలీ కొనసాగడానికి కారణమవుతోంది. 
 
ప్రస్తుతం సెన్సెక్స్ 424 పాయింట్ల లాభంతో 60,292 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 104 పాయింట్లు పెరిగి 17,925 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఏసియన్ పెయింట్స్, భారతి ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ తదితర కంపెనీల షేర్లు రాణిస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌ర్ స్టార్ ఇక ప్ర‌త్య‌క్ష‌పోరాటాల‌కు... నెల‌ఖ‌రులో చ‌ర్చ‌!