Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారతదేశం క్రీడా దేశం కాదు.. సానియా మీర్జా ఆవేదన

sania mirza
, గురువారం, 6 జులై 2023 (21:13 IST)
భారతదేశం క్రీడా దేశం కాదని విలపిస్తూ, టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా ఒలింపిక్ పతకాన్ని కోల్పోవడం పట్ల నిరాశను వ్యక్తం చేసింది. 2016లో రియో ​​ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కోల్పోయిన రోజు తాను, రోహన్ బోపన్న "అత్యంత చెత్త రోజులలో ఒకటి"గా ఆ ఆరోజును భావించామని తెలిపారు. 
 
సానియా 2006 దోహా, 2010 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలతో పాటు గ్రాండ్‌స్లామ్‌లో మూడు మహిళల డబుల్స్, మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ఫిబ్రవరి 2003 నుండి ఫిబ్రవరి 2023 వరకు రెండు దశాబ్దాల పాటు సాగిన ప్రొఫెషనల్ కెరీర్‌లో డబుల్స్‌లో నెం.1, మహిళల సింగిల్స్‌లో టాప్-30 ర్యాంక్ పొందిన ఏకైక భారతీయ మహిళా క్రీడాకారిణిగా సానియా మీర్జా నిలిచింది. 
 
2016లో జరిగిన రియో ​​ఒలింపిక్స్‌లో సానియా మీర్జా, రోహన్ బోపన్న కాంస్య పతక పోరులో చెక్ రిపబ్లిక్‌కు చెందిన లూసీ హ్రడెకా, రాడెక్ స్టెపానెక్ చేతిలో ఓడిపోయారు. తన కెరీర్‌లో తాను కోల్పోయినట్లు భావించే ఒలింపిక్ పతకం అదేని తాను అనుకుంటున్నట్లు సానియా ఆవేదన వ్యక్తం చేసింది. 
 
"2016లో రియోలో ఒలింపిక్ పతకానికి చాలా దగ్గరగా వచ్చాము. నేను మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత నేను సాధారణంగా ఏడవను, కానీ ఆ రోజు కూడా కొన్నిసార్లు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు, అది నాకు బాధ కలిగించింది" అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
ఒలింపిక్ పతకం గెలవడం అనేది ఏ అథ్లెట్‌కైనా ఉండే అతిపెద్ద కల. కానీ ఆ కల నెరవేరలేకపోయింది. చాలా కారణాల వల్ల తాము ఆ మ్యాచ్‌ను పరాజయం ముంగిట ముగించాల్సి వచ్చిందని సానియా వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ కోసం 77 అడుగుల భారీ కటౌట్..