Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : మునుగోడు బరిలో 11 మంది స్థానికేతరులు

munugode segment
, శనివారం, 25 నవంబరు 2023 (09:19 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు స్థానం నుంచి పోటీ చేస్తున్న వారిలో 11 మంది అభ్యర్థులు స్థానికేతరులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 11 మంది స్థానికేతరులు కావడం గమనార్హం. 
 
ఈ నియోజకవర్గ పరిధిలో చండూరు, నాంపల్లి, సంస్థాన్ నారాయణపూర్, చౌటుప్పల్, మునుగోడు, గట్టుప్పల, మర్రిగూడ మండలాలు ఉన్నాయి. అయితే, ఈ దఫా ఇక్కడ నుంచి 39 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అందులో చండూరు మండలవాసులు ఒక్కరూ బరిలో నిలవలేదు. 16 మంది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులు కాగా, అత్యధికంగా సంస్థాన్ నారాయణపుర్ మండలానికి చెందిన వారు ఎనిమిది మంది బరిలో ఉన్నారు. 
 
వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీపీఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి, బీజేపీ నుంచి చలమల్ల కృష్ణారెడ్డి, డీఎస్పీ నుంచి ఏర్పుల గాలయ్య ఉన్నా రు. అలాగే, మునుగోడుకు చెందిన వారు ముగ్గురు, మర్రిగూడకు చెందిన వారు ఐదుగురు, చౌటుప్పల్, నాంపల్లి, గట్టుప్పల మండలాలకు చెందిన వారు నలుగురు చొప్పున బరిలో నిలిచారు. 
w
కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నార్కేట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల గ్రామానికి చెందిన వారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట, వలిగొండ, నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, దేవరకొండ, కొండ మల్లేపల్లి మండలాల నుంచి ఒక్కొక్కరు చొప్పున బరిలో నిలిచారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం, సరూర్ నగర్ మండలాలకు చెందిన ముగ్గురు, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు ఒక్కరు చొప్పున పోటీలో ఉన్నారు.
 
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కోసం బరిలో ఉన్న అభ్యర్థుల్లో 39 మంది అభ్యర్థుల్లో ఒకరు నిరక్ష్యరాస్యులు కాగా మరొకరు ప్రకటించలేదు. ఒకరు పీహెచ్‌డీ, ఆరుగురు పోస్టుగ్రాడ్యుయేషన్ చేశారు. ఆరుగురు పట్టభద్రులుగా ఉన్నారు. ముగ్గురు ఎల్‌ఎల్బీ చేశారు. ముగ్గురు బీటెక్, 12 మంది ఇంటర్ ఐదో పదో తరగతి, ఒకరు తొమ్మిదో తరగతి చదివారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా ఓట్ల కోసం అభ్యర్థుల తిప్పలు... ఖరీదైన పట్టు చీరల తాయిలం