Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారాస అభ్యర్థికి కారు ఆపిమరీ వార్నింగ్ ఇచ్చిన కొండా సురేఖ

konda surekha
, శుక్రవారం, 1 డిశెంబరు 2023 (15:11 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ నన్నపునేని నరేందర్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారాస అభ్యర్థి కారు ఆపి మరీ ఈ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్రలను మానుకోవాలని హెచ్చరించారు. తమ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తేలేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
పోలింగ్ సందర్భంగా పెరుకవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల దాడిలో గాయపడిన కార్యకర్తలను కుమార్తె సుస్మిత పటేల్‌తో కలిసి సురేఖ పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. నన్నపునేని దగ్గరకెళ్లిన సురేఖ.. ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రదీప్ రావు కలిసిపోవడానికి సిగ్గులేదా, నిన్ను ఈ స్థాయికి ఎవరు తీసుకొచ్చారో తెల్వదా అని నిలదీశారు. 
 
దీంతో పక్కనే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేఖతో వాదనకు దిగుతూ చేయి లేపగా, ఆ వెంటనే ఆమె పక్కన కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అదే పని చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత కొండా సురేఖ మాట్లాడుతూ, చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగక... భయపెట్టుడు.. బెదిరించుడు చేస్తే ఒళ్లు పికులుద్ది అని మండిపడ్డారు. దీంతో పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ నరేందర్ అక్కడ నుంచి జారుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ కొత్త "సీక్రెట్ కోడ్" ఫీచర్‌