Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా? వద్దా? బదులివ్వండి... ఈడీకి కోర్టు నోటీసులు

k kavitha

ఠాగూర్

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (16:49 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలా వద్దా అనే అంశంపై సమాధానం ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులను కోర్టు ఆదేశిస్తూ, కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదావేసింది. తన కుమారుడి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు బెయిల్‌ మంజూరు చేయాలని మార్చి 26న ఆమె రౌస్‌ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది.
 
గత నెల 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసి మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. ముందుగా ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా.. న్యాయస్థానం ఏడు రోజులకు అనుమతి ఇచ్చింది. అనంతరం మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడు రోజులకు అనుమతించింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియడంతో.. అదే రోజు కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను హాజరు పరిచారు. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో తిహార్ జైలుకు తరలించారు. 
 
ఉద్యోగం మారారా? పీఎఫ్ సొమ్ముపై టెన్షన్ పడుతున్నారా? ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్ అమలు!! 
 
చాలా మంది ఉద్యోగులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగంలోకి మారుతుంటారు. ఇలాంటి వారు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బుల గురించి ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి వారికి ఈపీఎఫ్‌వో శుభవార్త చెప్పింది. ఉద్యోగం మారినా పీఎఫ్ గురించి టెన్షన్ అక్కర్లేదని తెలిపింది. ఈ కొత్త రూల్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం... ఒక ఉద్యోగి ఒక కంపెనీకి రాజీనామా చేసి మరో కంపెనీ ఉద్యోగంలో చేరినా అతని పీఎఫ్ సొమ్ము ఆటోమేటిక్‌ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయ్యేలా కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. పాత ఖాతాలోని సొమ్ము మొత్తం కొత్త ఖాతాలోకి బదిలీ అవుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే పనిలేకుండా మార్పులు ప్రభుత్వం చేసింది. 
 
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగం మారిన సందర్భంలో సదరు ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లు కూడా ఆటోమేటిక్‌గా విలీనం అవుతాయి. పాత ఖాతాలో ఉన్న నిధులు కొత్త ఖాతాలోకి బదిలీ అవుతాయి. దీంతో పీఎఫ్ ఖాతాలో సీనియారిటీ విషయంలోనూ టెన్షన్ పడాల్సిన అవసరం ఉద్యోగికి ఉండదు. సాధారణంగా పీఎఫ్ ఖాతాలో నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకున్నపుడు కొంత మొత్తం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఐదేళ్ల సర్వీసు దాటిన ఖాతాల నుంచి సొమ్ము తీసుకున్నపుడు అయితే ఈ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. తాజాగా అమల్లోకి వచ్చిన రూల్‌తో ఉద్యోగం మారినా పీఎఫ్ ఖాతా సీనియారిటీ విషయంలో మార్పుండదు. కాబట్టి ఈ పన్ను మినహాయింపు ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ గాంధీకి వారంటే భయం.. అందుకే అయోధ్యకు రాలేదు..