Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం: రూ. 1100 కోట్లు వెనకేసుకున్న మహిళలు

Free Bus

ఐవీఆర్

, గురువారం, 11 ఏప్రియల్ 2024 (15:51 IST)
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం కింద గడిచిన 4 నెలల కాలంలో మహిళలు రూ. 1100 కోట్లు ఆదా చేసుకున్నారని గణాంకాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకం రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక ఉపశమనం కలిగించే ముఖ్యమైన వనరుగా మారింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏప్రిల్ 7 వరకు కేవలం నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.1,177 కోట్లు ఆదా చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
 
మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని బాలికలు, మహిళలు, లింగమార్పిడి వ్యక్తులు TSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. డిసెంబర్ 9, 2023న ప్రారంభించబడిన ఈ పథకం ప్రారంభంలో రోజుకు సుమారు 14 లక్షల మంది మహిళలు ప్రయాణ సౌకర్యాన్ని పొందారు. ఇది క్రమంగా పెరిగింది. ఇప్పుడు సగటున 29.67 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
 
డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ నెలల్లో సగటున 26.99 లక్షలు, 28.10 లక్షలు, 30.56 లక్షలు, 31.42 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతిరోజూ సుమారు 6 లక్షల మంది మహిళలు కాంప్లిమెంటరీ బస్సు ప్రయాణ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. గతంలో బస్ పాస్, ఛార్జీల కోసం మహిళలు రూ.1500 వరకు వెచ్చించాల్సి వచ్చేది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం అమ్మకాలపై ఈసీ ఆంక్షలు.. మందుబాబులకు నిరాశ