Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త ... గ్రూపు-1 పరీక్షలకు గరిష్ట వయోపరిమితి పెంపు!!

revanthreddy

ఠాగూర్

, శనివారం, 10 ఫిబ్రవరి 2024 (09:38 IST)
తెలంగాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూపు-1 పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగులకు వయో పరిమితిని గరిష్టంగా 46 యేళ్లకు పెంచనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్ని నిబంధనల కారణంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఆలస్యమైందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను నియమించాలంటే నిర్ధిష్ట విధానం ఉంటుందన్నారు. త్వరలోనే పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం యువత చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.
 
అలాగే, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. నలుగురు ఉద్యోగాలు ఊడిపోయిన దుఃఖంలో ఉన్న విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని భారత రాష్ట్ర సమితి నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ప్రభుత్వం జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలను విక్రయించబోదన్నారు. ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకోబోదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కామారెడ్డితో అమానుషం.. దళిత మహిళను వివస్త్రను చేసి.. కళ్లలో కారంకొట్టి విద్యుత్ స్తంభానికి కట్టేసి....