Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుక్కల దాడిలో మరో చిన్నారి మృతి... ఎక్కడ?

Dogs
, సోమవారం, 25 డిశెంబరు 2023 (11:40 IST)
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా ఐదేళ్ళ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని షేక్ పేటలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, షేక్ పేటకు చెందిన అనూష, అంజి దంపతులు తమ కుమారుడుని ఈ నెల 8వ తేదీన గుడిసెలో నిద్రబుచ్చి పనికోసం బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి వచ్చి చూసేసరికి కుక్కలు దాడిలో తీవ్రంగా గాయపడి ఏడుస్తూ కనిపించాడు. 
 
ఆ వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో నీలోఫర్, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించి ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ బాలుడిపై మూడు వీధి కుక్కలు దాడి చేసినట్టు సీసీటీవీ ఫుటేజీల్లో తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇటీవల ఇలాంటి ఘటనే గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో జరిగ్గా, రాష్ట్ర హైకోర్టు సైతం తీవ్రంగా మందలించింది. 
 
ప్రజలు ఇచ్చే లంచాలతోనే మంత్రులకు సౌకర్యాలు : మడకసిర తాహసీల్దార్ వీడియో వైరల్  
 
రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు తమ ప్రాంతాల పర్యటనకు వచ్చినపుడు వారికి ఏర్పాట్లతో పాటు సకల సౌకర్యాలను ప్రజలిచ్చే లంచాలతోనే సమకూర్చుతున్నామని శ్రీ సత్యనాయి జిల్లా మడకశిర తాహసీల్దారు ముర్దావలీ చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ రైతుతో మాట్లాడిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మడకశిర మండలం మెళవాయి గ్రామ పరిధి సర్వే నంబరు 441-1లో అదే ఊరికి చెందిన రైతు విశ్వనాథ్ గుప్తాకు 90 సెంట్ల భూమి ఉంది. అందులో 17 సెంట్లను పక్క పొలం రైతుకు ఓ రెవెన్యూ అధికారి లంచం తీసుకుని, రాసిచ్చాడని రైతు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో దానిని సరిచేసి తన భూమి తనకు చెందేలా తహసీల్దార్ ముర్షావలి చేసి న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం గత ఆరు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో రైతు శనివారం తహసీల్దార్ ముర్షావలి చాంబర్‌లోకి వెళ్లి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. దీంతో తహసీల్దార్ ముర్షావలి రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చినపుడు మేం ఖర్చులు భరించాల్సి వస్తోంది. మడకశిరకు ఆరు నెలల క్రితం ఓ మంత్రి వచ్చినప్పుడు రూ.1.70 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం నలుగురు వీఆర్వోలు భరించారు. 
 
ఇటీవల కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మడకశిర వచ్చినపుడు అన్ని ఖర్చులూ తామే భరించామన్నారు. ఆ సెక్రటరీ మెనూలో బిర్యానీలు, స్టార్టర్లు, ఐస్క్రీంలు, డ్రై ఫ్రూట్స్‌తో పాటు పాన్ దోస కూడా ఉందని తన ఫోనులోని జాబితా చూపారు. పాన్ దోస బెంగళూరు నుంచి తెప్పించాల్సి వచ్చిందని వాపోయారు. ఈ ఖర్చులన్నీ తమ జీతాల నుంచి ఇచ్చుకోవాలా అంటూ మండిపడ్డారు. ఇన్ని ఖర్చులు భరించుకోవాలి కాబట్టే లంచాలు తీసుకుంటున్నామంటూ రైతుకు తహసీల్దార్ వివరించారు. ఈ సంభాషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తీవ్రంగా స్పందించారు. తహసీల్దారు ముర్షావలిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జ్వరం - గొంతు నొప్పితో బాధపడుతున్న సీఎం రేవంత్ రెడ్డి!