Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు - ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య!!

suicide

వరుణ్

, గురువారం, 25 ఏప్రియల్ 2024 (12:23 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ఏడుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో ఆరుగురు విద్యార్థులు, ఫెయిల్ అవుతామన్న భయంతో మరొకరు చనిపోయారు. మంచిర్యాల, ఖమ్మం, హైదరాబాద్, మహబూబాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్ జిల్లాల్లో ఈ విషాదకర ఘటనలు సంభవించాయి.
 
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచలాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్ (18), సస్పూర్ పరిధిలోని దొరగారిపల్లెకు చెందినద గటిక తేజస్విని (18), ఖమ్మం జిల్లా ముదిగొండ గ్రామానికి చెందిన వైశాలి (17), మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌‍కు చెందిన హరిణి ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షను రాసారు. ఈ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో పైన పేర్కొన్న ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరో ఘటనలో మహబూబా బాద్ జిల్లా రెడ్యాలకు చెందిన అశ్విని (17) వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
కాగా, సిద్ధిపేట జిల్లా మర్కుర్ మండలం పాతూరుకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఈరన్న శ్రీజ (17) కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భ యంతో ఆత్మహత్య చేసుకుంది. తీరా చూస్తే ఆ విద్యార్థిని 401 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. బుధవారం ఉదయం ఈ ఫలితాలు వెల్లడికాగా శ్రీజ అంతకుముందే అర్థరాత్రి ఈ విషాదకర నిర్ణయం తీసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హస్తం గుర్తుకు ఓటు వేయొద్దు.. బీఏపీ అభ్యర్థికి ఓటు వేయండి : కాంగ్రెస్ నేతల ప్రచారం