Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్

kcrao

సెల్వి

, మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (17:44 IST)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె కె కవిత అరెస్ట్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సాధారణంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాల్లో ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు పార్టీలోని కీలక సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 
 
కానీ కేటీఆర్ స్పందిస్తూనే వున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర అధికారులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కానీ కేసీఆర్ ఆశించిన స్థాయిలో ఫైర్ కాలేదు.
 
అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారని, అనేక పార్లమెంటరీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కార్యకర్తలను రాజీ చేశారని ఆరోపించారు. 
 
కేసీఆర్‌ మోదీకి అమ్ముడుపోయారని, తన కూతురు కవితకు బెయిల్‌ ఇచ్చేలా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌తో రాజీ పడ్డారని అన్నారు. 
 
జైలులో ఉన్న తన కూతురు కవితను బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను బలితీసుకున్న తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ చేతులు కలిపి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ మౌనంగా పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్న బీజేపీ?