Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు పిల్లలను గొంతుకోశాడు.. తర్వాత ఉరేసుకున్నాడు.. ఎందుకని?

suicide

సెల్వి

, మంగళవారం, 5 మార్చి 2024 (11:55 IST)
తెలంగాణలోని రంగారెడ్డిలో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగుటూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రవి (35) అనే వ్యక్తి 6 నుంచి 13 ఏళ్ల వయసున్న తన ముగ్గురు కుమారులను హత్య చేసి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
పిల్లలను గొంతుకోసి హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అధిక రాబడులు ఇస్తానని ఆ వ్యక్తి కొందరిని మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లో చేర్చుకున్నాడని పోలీసులు తెలిపారు. వాగ్దానం చేసిన మొత్తాన్ని నిర్ణీత వ్యవధిలో తిరిగి చెల్లించకపోవడంతో గ్రామస్తులు డబ్బులు డిమాండ్ చేయడం ప్రారంభించారు. 
 
ఈ విషయమై రవి తన భార్యతో గొడవ పడ్డాడని, ఆమె తమ ఆరేళ్ల కుమారుడిని వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కానీ చనిపోయేటప్పుడు తన ముగ్గురు కుమారులను గొంతు కోసం చంపి, ఆపై ఉరివేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 17 చోట్ల ఎన్.ఐ.ఏ సోదాలు...