Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 51 రైళ్లు రద్దు... ఎందుకో తెలాసా?

mmts train

ఠాగూర్

, ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (14:05 IST)
హైదరాబాద్ నగరంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులకు అంతరాయం కలుగనుంది. ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ సరా మొత్తం 51 రైళ్లను రద్దు చేశారు. దీనికి కారణం రెండో దశ నిర్మాణ పనులను కారణంగా వీటిని రద్దు చేశారు. మౌలాలి - సనత్ నగర్ స్టేషన్ల మధ్య నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ - కాగజ్ నగర్ రైలును కూడా రద్దు చేశారు. దీంతో ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 23 ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు 51 రైళ్లను రద్దే చేసినట్టు చెప్పారు. 
 
ఈ రైళ్లను టైమ్ టేబుల్ ప్రకారం రద్దు చేసినట్టు తెలిపారు. వీటిలో ఈ నెల 9వ తేదీ వరకు మూడు ఎంఎంటీఎస్‌లు, 10వ తేదీ వరకు మరో రెండు, 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు చేసినట్టు పేర్కొన్నారు. వీటితో పాటు మౌలాలి - అమ్ముగూడ - సనత్ నగర్ మార్గంలో నడిచే హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ - గుంటూరు, రేపల్లె - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల షెడ్యూల్ వారీగా ఆపేస్తామని వివరించారు. 
 
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో నిర్మిస్తున్న రైల్వే టెర్మినల్ ఈ యేడాది మార్చి చివరినాటికి సిద్ధమవుతుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా, సనత్ నగర్ - మౌలాలి మధ్య రెండో లైను కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్‌ను బైపాస్ చేస్తూ కొన్ని రైళ్లను నడిపే అవకాశం కలుగుతుందని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

150 సార్లు వెబ్ సిరీస్ చూసి దొంగనోట్లు ముద్రించాడు...