Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ ఆర్టీసీ - ఆ తరహా టిక్కెట్ల జారీ నిలిపివేత

sajjanar
, ఆదివారం, 31 డిశెంబరు 2023 (12:25 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీని నిలిపివేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. దీంతో బస్సుల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. పైగా, ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్ల ప్రయాణం చేసే వారిని గుర్తింపు కార్డులు చూసి వయస్సు నిర్ధారించుకోవాల్సి ఉంది. దీంతో ఆలస్యమైపోతుంది. అంతిమంగా సమయ పాలనపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఈ రెండు టిక్కెట్ల జారీని నిలిపివేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. 
 
జనవరి ఒకటో తేదీ నుంచి ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ-24, టి-6 టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఈ టికెట్లు జారీ చేయాలంటే ప్రయాణికులు తమ గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. వారి వయసును టికెట్‌లో కండక్టర్ నమోదు చేయాల్సి ఉంటుంది. బస్సుల్లో ప్రస్తుతం నెలకొన్న రద్దీ కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఇది అంతిమంగా ప్రయాణ సమయంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురువుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ-24, టీ-6 టిక్కెట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్టు సజ్జనార్ తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రాఫిక్ సమస్య... లోకల్ రైలులో ప్రయాణించిన ముంబై బిలియనీర్.. వీడియో వైరల్