Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యంలో నీళ్లకు బదులు యాసిడ్ కలుపుకుని తాగిన యువకుడు...

మద్యంలో నీళ్లకు బదులు యాసిడ్ కలుపుకుని తాగిన యువకుడు...
, బుధవారం, 30 జనవరి 2019 (16:52 IST)
ఓ యువకుడు మంచినీళ్లనుకుని యాసిడ్‌ను మద్యంలో కలుపుకుని త్రాగి ప్రాణాలు కోల్పోయిన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్‌రావు అందించిన సమాచారం ప్రకారం, కుమ్మరివాడికి చెందిన గణపతిస్వామికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడైన విజయ్‌కుమార్(26) ఆటోని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఆదివారం సాయంత్రం మద్యం సీసాతో ఇంటికి వచ్చిన విజయ్ మిద్దె పైకి వెళ్లాడు, అక్కడ బాత్‌రూమ్ కిటికీపై ఉన్న యాసిడ్ బాటిల్‌ని నీళ్ల సీసాగా భావించి మద్యంలో కలుపుకుని తాగాడు. కొద్దిసేపటికి గొంతులో మంట పుట్టడంతో యాసిడ్‌గా గుర్తించాడు, గట్టిగా కేకలు పెట్టాడు.
 
ఇంట్లో ఉన్న తండ్రి అప్రమత్తమై హుటాహుటిన స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విజయ్‌కుమార్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.5 వేల కోసం ఫ్రెండ్‌ను చంపేశాడు.. ఎక్కడ?