Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహజీవనం చాలు, పెళ్లి వద్దన్నందుకు పెట్రోల్ పోసాడు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల రాకేష్‌ రాయ్‌ ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లోని బోడుప్పల్‌‌కు వచ్చి ఏనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. నాచారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే షన్నుతో పరిచయం ఏర్పడి అది కాస్తా వ

సహజీవనం చాలు, పెళ్లి వద్దన్నందుకు పెట్రోల్ పోసాడు
, మంగళవారం, 7 ఆగస్టు 2018 (14:29 IST)
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 25 ఏళ్ల రాకేష్‌ రాయ్‌ ఉపాధి నిమిత్తం  హైదరాబాద్ లోని బోడుప్పల్‌‌కు వచ్చి ఏనిమిదేళ్లుగా నివాసం ఉంటున్నాడు. నాచారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేసే షన్నుతో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. షన్నుకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
భర్తతో గొడవలు కారణంగా వేరుగా ఉంటుంది షన్ను. రాకేష్‌ రాయ్‌, షన్ను సహజీవనం చేస్తున్నారు. రాకేష్‌ తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు అడిగినా తనకు పిల్లలు ఉన్నారని, పెళ్లి చేసుకోవడం కుదరదని తేల్చి చెప్పింది షన్ను. ఎలాగూ సహజీవనం చేస్తున్నాం కదా అది చాలు అని చెప్పింది. 
 
ఐతే రాకేష్ మాత్రం ఒప్పుకోలేదు. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టాడు. పలుమార్లు పెళ్లి విషయంపై ఇరువురు ఘర్షణ పడ్డారు. గత నెల 27న మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇద్దరూ తీవ్రంగా పోట్లాడుకున్నారు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో రాకేష్‌ రాయ్‌ ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి అక్కడి నుంచి నేరుగా ఉత్తరప్రదేశ్ పారిపోయాడు. షన్ను తండ్రి ఫిర్యాదు, మృతురాలి మరణ వాంగ్మూలంతో హత్య కేసుగా నమోదు చేసి ఉత్తరప్రదేశ్‌లో తలదాచుకున్న రాకేష్‌రాయ్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిద్ధిపేటలో కొత్త ట్రెండ్.. భార్యాభర్తలుగా కలరిచ్చి.. ఆ దందా..?