Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

200 మంది ఐటీ ఉద్యోగుల్ని రోడ్డున పడేసిన వెరిజాన్, ఉద్యోగులు గగ్గోలు...

సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఐటీ రంగంలో పోటీ ఎక్కువ కావడం ఒకవైపు, నానాటికీ ఈ కోర్సులను చేసేవారు ఎక్కువ సంఖ్యలో వుండటంతో పరిస్థితి దిగజారుతోంది. మాదాపూర్‌ ఐట

200 మంది ఐటీ ఉద్యోగుల్ని రోడ్డున పడేసిన వెరిజాన్, ఉద్యోగులు గగ్గోలు...
, శుక్రవారం, 5 జనవరి 2018 (21:20 IST)
సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఐటీ రంగంలో పోటీ ఎక్కువ కావడం ఒకవైపు, నానాటికీ ఈ కోర్సులను చేసేవారు ఎక్కువ సంఖ్యలో వుండటంతో పరిస్థితి దిగజారుతోంది. మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాకానికి 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీరితో సదరు కంపెనీ బలవంతంగా సంతకాలు చేయించి రాజీనామా చేయించినట్లు ఆరోపణలు చేస్తున్నారు. 
 
వెరిజాన్‌ డాటా సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(వీడీఎస్‌) ఈ పనికి పూనుకున్నదని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. తమను ఒక్కొక్కరిని గదిలోకి పిలిపించి బలవంతంగా రాజీనామా పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 
 
రిజైన్ పత్రాలపై సంతకం చేయనివారి పట్ల బౌన్సర్లతో భౌతిక దాడులు చేసేందుకు సైతం వారు వెనుకాడలేదంటూ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కనీసం తమ వస్తువులను తీసుకునేందుకు సైతం అవకాశం ఇవ్వకుండా గెంటివేశారంటూ వాపోయారు. కాగా ఐటీ ఉద్యోగులకు భద్రత కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గజల్ శ్రీనివాస్ వీడియోలను ఎందుకలా పంపారు? పోలీసులపై కోర్టు ఆగ్రహం