Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణలో సైకిళ్లపై పోలీసులు... ఎందుకో తెలుసా?

స్ట్రీట్ పెట్రోలింగ్ అనే ఒక నూతన పోలీస్ పెట్రోలింగ్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంజాగుట్ట పోలీసులు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ప్రత్యేకతలు ఏమంటే వెనుకభాగంలో ఫస్ట్ ఎయిడ్ కిట్

తెలంగాణలో సైకిళ్లపై పోలీసులు... ఎందుకో తెలుసా?
, బుధవారం, 18 జులై 2018 (16:55 IST)
స్ట్రీట్ పెట్రోలింగ్ అనే ఒక నూతన పోలీస్ పెట్రోలింగ్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంజాగుట్ట పోలీసులు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ప్రత్యేకతలు ఏమంటే వెనుకభాగంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ డబ్బాతో పాటు కమ్యూనికేషన్ అందించటానికి మాన్పాక్ట్, GPS System, లాఠీతో పాటు వాటర్ బాటిల్ మొదలైనవి ఉన్నాయి.
 
దీని ముఖ్య ఉద్దేశం సమర్థవంతంగా కమ్యూనిటీ పోలీసింగ్, నేరాలను అరికట్టడం, మారుమూల ప్రదేశాల్లోకి కూడా సులువుగా చేరుకొని అక్కడ పౌరసేవలు అందించటంతో పాటు పెట్రోలింగ్‌కి వెళ్లే ఆఫీసర్ శారీరక దృఢత్వం పెంచుకునే అవకాశం ఇందులో ఉండటం దీనియొక్క ముఖ్యఉద్దేశం. ఈ విధానానికి నగరపోలీస్ కమీషనర్ అనుమతి ఇవ్వటం జరిగింది. 
 
ఈ రోజు నుంచి నాలుగు సైకిల్స్ పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తాయని పంజాగుట్ట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్, ఎస్ఐ. గురునాథ్ తెలియచేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మాన్‌సూన్ హంగామా'తో మరో సంచలనానికి జియో... జూలై 20న మీకోసం...