Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రుతుపవనాలు బలహీనం.. తెలంగాణలో భారీ వర్షాలు లేవు..

మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల

రుతుపవనాలు బలహీనం.. తెలంగాణలో భారీ వర్షాలు లేవు..
, శనివారం, 9 సెప్టెంబరు 2017 (09:10 IST)
మధ్యప్రదేశ్‌ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు భూతలంపై 900 మీటర్ల ఎత్తు వరకు ద్రోణి ఏర్పడింది. మరోవైపు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ నుంచి కర్ణాటకలోని ఉత్తర ప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం 3.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. దీంతో తెలంగాణలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నందున శనివారం నుంచి ఈ నెల 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని హైదరాబాద్ వాతావరణ అధికారి వై.కె.రెడ్డి చెప్పారు. 
 
అయితే అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లుల నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయని తెలిపారు. కానీ భారీ వర్ష సూచన లేదన్నారు. గురు, శుక్రవారాల్లో అత్యధికంగా నారాయణపేటలో 7, మొగుళ్లపల్లిలో 6, ధర్మసాగర్‌, దామెరగిద్ద, భీర్కూర్‌, కోటగిరి, వికారాబాద్‌లలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసిందని రెడ్డి తెలిపారు. 
 
అయితే సెప్టెంబర్ ఆరు, ఏడు తేదీల్లో రాయ‌ల‌సీమ‌, తెలంగాణ ప్రాంతాల మీదుగా కొన‌సాగుతున్న‌ ఉప‌రిత‌ల ద్రోణి కారణంగా.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాజెక్టుల వద్ద నిద్రపోయా... పరుగెత్తిస్తున్నా... సీఎం చంద్రబాబు