Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి కేటీఆర్‌తో నడిరోడ్డుపై టెక్కీ వైష్ణవి సెల్ఫీ... చూడండి...

మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పైన వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కెటిఆర్‌ను చూసి విష్ చేయగా వెంటనే కారు నుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆ

మంత్రి కేటీఆర్‌తో నడిరోడ్డుపై టెక్కీ వైష్ణవి సెల్ఫీ... చూడండి...
, మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (17:51 IST)
మంత్రి కేటీఆర్ మరోసారి ఓ సాధారణ పౌరుడిగా వ్యవహరించారు. కింగ్ కోటి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్( రెడ్) పడగానే తన వాహనశ్రేణిని ఆపారు. బైక్ పైన వెళ్తున్న బెంగళూరు ఐటీ ఉద్యోగి కెటిఆర్‌ను చూసి విష్ చేయగా వెంటనే కారు నుంచి దిగి ఆమెను పలకరించారు. మంత్రి కేటీఆర్‌తో సెల్ఫీ దిగాలన్న కోరికను వైష్ణవి వ్యక్తం చేయగా అందుకు వెంటనే మంత్రి అంగీకరించారు. 
 
వైష్ణవితో పాటు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న పలువురు కెటిఆర్‌తో సెల్ఫీలు దిగడానికి ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓ సీఎం కుమారుడని, కీలక శాఖల మంత్రిని అనే అధికార దర్పం ప్రదర్శించకుండా సామాన్యుడిలా వ్యవహరించిన కేటీఆర్ తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో తమిళిసై సౌందరరాజన్‌కు ఆ అనుభవం..?