Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దర్శకుడు క్రిష్ డ్రగ్ కు బానిస, అందుకే భార్య వదిలేసిందా?

Director Krish

డీవీ

, గురువారం, 29 ఫిబ్రవరి 2024 (12:12 IST)
Director Krish
తెలుగు చలన చిత్ర దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ ఇప్పుడు డ్రెగ్ కేసులో ఇరుక్కున్నాడని వార్తలు తెలియజేస్తున్నాయి. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు అతనితోపాటు నిర్భయ సింధి, రఘు చరణ్ తదితరులు వున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. పోలీసులు పరిశోధన చేస్తున్నారు. పోలీసుల అదుపులో బీజేపీ నేత కుమారుడు వివేకానంద్ తోపాటు  పార్టీ జరిగిన గదిలో డైరెక్టర్ క్రిష్ ఉన్నట్టు ఆరోపణ. అయితే ఇప్పటికే డ్రెగ్ కేసులో పూరీజగన్నాథ్, నవదీప్, చార్మి లాంటివారు కూడా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
 
కాగా, క్రిష్ వున్నాడని వార్తలు రావడంతో ఫిలింనగర్ లో పలు కథనాలు వినిపిస్తున్నాయి. గతంలో డాక్టర్ అయిన రమ్య వెలగ ను వివాహం చేసుకున్నాడు క్రిష్. కానీ కొద్దిరోజులలోనే విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఇద్దరు ఫీల్డులు వేరు కాబట్టి సర్దుకోలేకపోయారని వార్తలు వచ్చాయి. కానీ ఈరోజు డ్రెగ్ వ్యవహారం బయటకు వచ్చాక డాక్టర్ రమ్యకు క్రిష్ గురించి తెలుసుకున్నాక విడాకులు తీసుకుందని కొందరు భావిస్తున్నారు. 
 
అయితే క్రిష్ పై వచ్చిన ఈ ఆరోపణలో నిజానిజాలు ఎలా వున్నా, ఆయన దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ తాజా సినిమా హరిహర వీరమల్లు పై తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయ నాయకుడిగా పవన్ పై కూడా ఒత్తిడి వుంటుందనీ, కనుక ఈ సినిమాకు మొదటినుంచి వున్న అడ్డంకులకు తోడు డ్రెగ్ వివాదం మరో అడ్డంకి కానున్నందని భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇలాంటి దేశంలో ఆడపిల్లగా పుట్టడం నా కర్మ.. అన్నపూర్ణమ్మపై చిన్మయి.. కేసు నమోదు