Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృతిసనన్ హీరోయిన్ ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు.. భైరవి గోస్వామి పిచ్చి వాగుడు

బాలీవుడ్ హీరోయిన్, మహేష్ బాబు నేనొక్కడినే స్టార్ కృతిసనన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా మారుమ్రోగిపోతోంది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద అవకాశాలు లేకపోయినా.. దొరికిన అవకాశాలు చేసుకుంటూ పోతున్న కృతిసనన్‌పై పలు

కృతిసనన్ హీరోయిన్ ఎలా అయ్యిందో అర్థం కావట్లేదు.. భైరవి గోస్వామి పిచ్చి వాగుడు
, సోమవారం, 31 జులై 2017 (14:30 IST)
బాలీవుడ్ హీరోయిన్, మహేష్ బాబు నేనొక్కడినే స్టార్ కృతిసనన్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియా మారుమ్రోగిపోతోంది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద అవకాశాలు లేకపోయినా.. దొరికిన అవకాశాలు చేసుకుంటూ పోతున్న కృతిసనన్‌పై పలు హిందీ టివి సీరియల్స్, సినిమాల్లో నటించిన భైరవి గోస్వామి అనే నటి ఘాటుగా విమర్శలు చేసింది. ప్రస్తుతం కృతి సనన్ అర్జున్ కపూర్ ముబారకన్ సినిమాలో ఓ ఐటమ్ పాటకు డ్యాన్స్ వేసింది. 
 
ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. కృతిపై భైరవ్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేసింది. రాబ్తా సినిమా ఫ్లాప్ కావడంతో కృతి బాగా డిస్టబ్ అయినట్లు కనిపిస్తోందని కేఆర్కే చేసిన ట్వీట్‌కు రీ ట్వీట్ చేస్తూ.. అవును ఆమెకు పిచ్చెక్కినట్లుంది. అలానే ప్రవర్తిస్తోంది. ఇంతకీ కృతి హీరోయిన్ ఎలా అయ్యిందో అర్థం కావట్లేదని భైరవి గోస్వామి విమర్శించింది.
 
కృతి సనన్‌ కంటే కాలేజీల్లో చదివే విద్యార్థినులు అందంగా ఉంటారని కామెంట్ చేసింది. దీనిపై కృతిసనన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కృతిని విమర్శించే ముందు తనేంటో తెలుసుకోవాలని కామెంట్లు చేశారు. సినిమాల్లో అవకాశాలు లేక సీరియల్స్‌లో నటిస్తున్న భైరవి.. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా పాపులర్ కావాలని ప్రయత్నిస్తుందని ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవసేన బరువు తగ్గింది.. స్లిమ్‌గా మారిన స్వీటీ ఇక ''సాహో''లో నటిస్తుందా?