Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాంగోపాల్ వర్మ ఓ మెంటల్‌గాడు... 'మా' అధ్యక్షుడు శివాజీరాజా

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యా

రాంగోపాల్ వర్మ ఓ మెంటల్‌గాడు... 'మా' అధ్యక్షుడు శివాజీరాజా
, శనివారం, 12 ఆగస్టు 2017 (14:50 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒకరుకాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇపుడు ఈ వ్యాఖ్యలు ఫిల్మ్ నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. 
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో పలువురు సినీ ప్రముఖులను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు పిలిచి విచారించిన విషయంతెల్సిందే. అయితే, ఈ విషయంలో సిట్ చీఫ్ అకున్ సభర్వాల్‌ను అందరూ బాహుబలితో పోలుస్తున్నారని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 సినిమా తీయాలని రాంగోపాల్ వర్మ కామెంట్స్ చేశారు. దీంతో డ్రగ్స్ కేసు వ్యవహారం ఒక్కసారి వేడెక్కింది. 
 
పోలీస్ అధికారుల్ని రెచ్చగొట్టడం మనకే మంచిదికాదంటూ మూవీ ఆర్టిస్టుల సంఘం అధ్యక్షుడు శివాజీ రాజా అప్పట్లో వర్మకు సున్నితంగా కౌంటర్ ఇచ్చారు. అయినప్పటికీ ఆర్జీవీ తీరుమార్చుకోలేదు. అదేసమయంలో తెలుగు చిత్రసీమలో కొన్ని డ్రగ్స్ పురుగులు ఉన్నమాట వాస్తవమేనని, వాళ్లను మేమేదారిలో పెట్టుకుంటామని, ఇంతవరకూ జరిగిన సంఘటనలకు పరిశ్రమ బాధపడుతోందని తెలంగాణ ప్రభుత్వానికి మూవీ ఆర్టిస్టుల సంఘం, ఫిలిం ఛాంబర్ సంయుక్తంగా రాసింది. 
 
ఈ లేఖ మీద కూడా రాంగోపాల్ వర్మ అప్పుడే తీవ్రంగా స్పందించారు. ఈ లేఖ ద్వారా తాము చెయ్యని తప్పును ఒప్పుకున్నట్లయిందని, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని వర్మ సోషల్ మీడియాలో కామెంటరీ ఇచ్చేశారు. దీంతో మూవీ ఆర్టిస్టుల సంఘం వర్మను ఎట్టిపరిస్థిల్లోనూ ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ''ఆర్జీవీకి నిజంగానే మెంటల్ ఎక్కింది. ఆయన్ను ఒక్కరు కాదు ఇద్దరు డాక్టర్లకు చూపించాలి'' అంటూ మా అధ్యక్షుడు శివాజీ రాజా మండిపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎముకలు కొరికే చలిలో వేడిసెగలు పుట్టిస్తున్న బాలయ్య హీరోయిన్ (Video)