Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ తెరపై కనిపించనున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' జోడీ

''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జ

మళ్లీ తెరపై కనిపించనున్న ''రారండోయ్ వేడుక చూద్దాం'' జోడీ
, గురువారం, 22 ఫిబ్రవరి 2018 (11:18 IST)
''రారండోయ్ వేడుక చూద్దాం'' సినిమాలో చైతూకు జోడీగా నటించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ నాగచైతన్యతో రొమాన్స్ చేసే అవకాశాన్ని కైవసం చేసుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న ఈ జంట.. మళ్లీ వెండితెరపై కనిపించనుంది. 
 
గతంలో కృష్ణవంశీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన సౌజన్య చైతూ-రకుల్‌కి ఓ కథ వినిపించిందని.. ఆ కథ కొత్తగా వుండటంతో ఇద్దరూ ఆ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో వున్న సినిమాలు పూర్తి చేసుకుని ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ జంట సిద్ధమవుతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. 
 
మే లేదా జూన్ నెలల్లో ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాతో పాటు మరో రెండు-మూడు తమిళ సినిమాలు రకుల్ చేతిలో వున్నాయి. ఇక నాగచైతన్య ఎస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ''శైలజా రెడ్డి అల్లుడు'' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీరవ్ ''గీతాంజలి''తో కంగనా రనౌత్‌, బిపాసా బసులకు కష్టాలు