Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐష్‌కు ఒళ్లు మండింది... ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది

బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కు ఒళ్లు మండింది. మీడియా ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది. అదీ కూడా కంటతడిపెడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది సినిమా ఆడియో ఫంక్షన్ కాదనీ, తమ ప్రైవసీని కాస్తైనా గౌరవించండంటూ

ఐష్‌కు ఒళ్లు మండింది... ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది
, మంగళవారం, 21 నవంబరు 2017 (13:04 IST)
బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్‌కు ఒళ్లు మండింది. మీడియా ఫోటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది. అదీ కూడా కంటతడిపెడుతూ వారిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది సినిమా ఆడియో ఫంక్షన్ కాదనీ, తమ ప్రైవసీని కాస్తైనా గౌరవించండంటూ ప్రాధేయపడింది.
 
ఇటీవల ముంబైలో తన తండ్రి జయంతి వేడుకలను ఆమె తన తల్లి బృందతో కలిసి జరుపుకుంది. ఇందులోభాగంగా, శుశృష హాస్పిటల్‌కు ఐష్, ఆమె తల్లి, కుమార్తె ఆరాధ్యలను తీసుకెళ్లింది. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రైవేట్ కార్యక్రమంలో అక్కడున్న చిన్నారుల మధ్య తండ్రి జయంతి వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
 
అయితే, కార్యక్రమ నిర్వాహకుల కంటే అక్కడ పదుల సంఖ్యలో ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో నిండిపోయారు. పైగా, ఐష్ అక్కడకు రాగానే ఫొటోలు క్లిక్‌మనిపించడంతో ఆమెకు ఒళ్లు మండింది. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన ఐశ్వర్య.. ఫొటోగ్రాఫర్లకు క్లాస్ పీకింది. తన ప్రైవసీని గౌరవించాలని తడినిండిన కళ్లతో ఐశ్వర్య వేడుకుంది.
 
'ప్లీజ్ ఆపుతారా. మీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇదేమీ ప్రిమియర్ షో కాదు. మరేదో పబ్లిక్ ఈవెంట్ కాదు. కాస్తయినా గౌరవం ఇవ్వడం నేర్చుకోండి' అంటూ ఐష్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ తర్వాత అక్కడున్న చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి తన తండ్రి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ్ - వర్మ "కంపెనీ" షూటింగ్ వీడియో