Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్‌బాస్ నుంచి సునైనా అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న తనీష్

బిగ్‌బాస్ సీజన్ 2లో భాగంగా ఈ వారం దీప్తి సునైనా బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు. తర్వాత స్టేజ్ మీదకి వ

బిగ్‌బాస్ నుంచి సునైనా అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న తనీష్
, సోమవారం, 20 ఆగస్టు 2018 (11:54 IST)
బిగ్‌బాస్ సీజన్ 2లో భాగంగా ఈ వారం దీప్తి సునైనా బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యింది. దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు. తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన సునైనా.. తనీష్, సామ్రాట్‌లతో మాట్లాడాలని ఉందని కోరింది. తనీష్‌తో మాట్లాడుతూ.. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావ్.. టైటిల్ కొట్టి బయటకి రా అంటూ ధైర్యం చెప్పింది. 
 
అలాగే తనీష్ మాట్లాడుతూ.. తనకు కుమార్తె పుడితే సునైనా లాగానే వుండాలని కోరుకుంటాను.. సునైనా ఎప్పుడూ నువ్ నీలానే వుండాలని ఎమోషనల్ అయ్యాడు. ఆ తరువాత సునైనా బిగ్ బాంబ్‌ని తనీష్ పై విసిరింది. దీని ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లో సాంగ్ వచ్చిన ప్రతిసారి స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి వుంటుంది. ఇకపోతే.. సునైనా ఎలిమినేట్ కావడం వెనుక కౌశల్ ఆర్మీ ప్రభావం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.  
 
కాగా బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో 70వ రోజున సునైనా ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఎలిమినేషన్‌కు ముందు గీత గోవిందం దర్శకుడు పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ బిగ్‌బాస్ వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత దీప్తి సునైనతో సీక్రెట్ టాస్క్‌ను నానీ, విజయ్, పరుశురాం పర్యవేక్షణలో జరిపించారు. టాస్క్‌లో భాగంగా గీతా, సామ్రాట్‌ను లడ్డూతో కొట్టింది. నిద్రిస్తున్న అమిత్‌పై నీళ్లు పోసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ రిపీట్?