Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూల్స్ అంటూ క్లాసులు పీకే కౌషల్‌కు బిగ్ బాస్ వార్నింగ్.. గుడ్ల దొంగ ఇతనేనా

నిన్నటి ఎపిసోడ్‌లో కౌషల్ కౌశల్ పేపర్ మీద ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో దీన్ని గమనించిన బిగ్ బాస్ ఏమి రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారని కౌషల్‌ను ప్రశ్నించగా బిగ్ బాస్ హౌస్‌లో నేటితో వంద రోజులు పూర్తయ్యాయ

రూల్స్ అంటూ క్లాసులు పీకే కౌషల్‌కు బిగ్ బాస్ వార్నింగ్.. గుడ్ల దొంగ ఇతనేనా
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (11:37 IST)
నిన్నటి ఎపిసోడ్‌లో కౌషల్ కౌశల్ పేపర్ మీద ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో దీన్ని గమనించిన బిగ్ బాస్ ఏమి రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారని కౌషల్‌ను ప్రశ్నించగా బిగ్ బాస్ హౌస్‌లో నేటితో వంద రోజులు పూర్తయ్యాయని, ఈ వంద ఎపిసోడ్‌లలో జరిగిన టాస్క్‌లు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయ్యారు, అలాగే హౌస్‌మేట్స్ మీద తనకున్న అభిప్రాయాలను రాసుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు.
 
దీనిపై సీరియస్ అయిన బిగ్ బాస్ ఇలా చేయడం హౌస్‌లోని నియమాలకు విరుద్ధం, వంద రోజులు గడిచిన తర్వాత కూడా ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. గీత మైక్‌కి చేయి అడ్డు పెట్టి గుసగుసలాడుతోంది, అలాగే మిగతా సభ్యులు కూడా రూల్స్ సరిగ్గా పాటించడం లేదని, ఇలాగే చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు బిగ్ బాస్.
 
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో ఇచ్చిన టాస్క్ ప్రకారం రిపోర్టర్, ఫోటోగ్రాఫర్‌గా ఒక్కొక్కరు ఉంటూ అక్కడ జరుగుతున్న విషయాలను కవర్ చేసి, వాటిని స్టోరీలుగా నివేదించాలని చెప్పారు. దీని కోసం నిఘా పెట్టిన రోల్ రైడా, కౌషల్ రాత్రిపూట గుడ్లు దొంగతనం చేసి, ఎవరికీ తెలియకుండా తింటున్నాడని తెలుసుకుని నిర్ఘాంతపోతాడు. దీన్ని ఎలాగైనా తన కెమెరాతో బయటపెడతానని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంకా పరువు హత్యలేంట్రా జంగిల్ ఫెల్లోస్... హీరో రామ్ సంచలన వ్యాఖ్యలు