Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెలెబ్రిటీలపై మండిపడిన సంజన.. తొలిరోజే బిగ్‌బాస్ హౌస్‌లో?

నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్ బాస్ షో ప్రారంభమైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అందరూ చేరుకున్నాక సామాన్యులకు సెలబ్రిటీలీ షాకిచ్చారు. హౌస్ నుంచి బయటకు పంపించేందుకు ఇద్దరి ఎంచుకోవాలని బిగ్‌బా

సెలెబ్రిటీలపై మండిపడిన సంజన.. తొలిరోజే బిగ్‌బాస్ హౌస్‌లో?
, సోమవారం, 11 జూన్ 2018 (10:29 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించే బిగ్ బాస్ షో ప్రారంభమైంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి అందరూ చేరుకున్నాక సామాన్యులకు సెలబ్రిటీలీ షాకిచ్చారు. హౌస్ నుంచి బయటకు పంపించేందుకు ఇద్దరి ఎంచుకోవాలని బిగ్‌బాస్ సూచించగా, సెలెబ్రిటీలు సంజన, నూతన్ నాయుడుల పేర్లను సూచించారు. దీంతో వారిద్దరూ షాకయ్యారు. 
 
బిగ్‌బాస్ ఆదేశాలతో సెలబ్రిటీలు సూచించిన సంజన, నూతన్ నాయుడులను హౌస్‌లో ఉన్న జైలులో పెట్టి బంధించారు. ఫలితంగా నేటి ఎపిసోడ్‌‌లో వీరిలో ఒకరిని బయటకు విడుదల చేస్తారు. ఆ ఒక్కరు ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయితే సంజన సెలెబ్రిటీలపై మండిపడింది. విజయవాడకు చెందిన మోడల్ సంజన అన్నె మాట్లాడుతూ.. అంతమంది సెలబ్రిటీలు వుండగా, తమ పేర్లను ఎలా సూచిస్తారని ఫైర్ అయ్యింది.
 
అంతకుముందు, బిగ్‌బాస్ సీజన్ 2లో హోస్ట్‌‌గా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాని. వచ్చీ రావడంతో ఫ్లైయింగ్ కిస్‌లతో మోడల్స్ బిగ్‌బాస్ సెట్‌లో చిందేసి సందడి చేశాడు. ఇకపోతే.. . గీతా మాధురి (సింగర్), అమిత్ తివారీ (నటుడు), దీప్తి నల్లమోతు (టీవీ 9 యాంకర్), తనీష్ (నటుడు), బాబు గోగినేని (క్రిటిక్), భాను శ్రీ (నటి),  రోల్ రైడా (ర్యాప్ సింగర్), యాంకర్ శ్యామల, కిరీటి దామరాజు (నటుడు), దీప్తి సునైనా (యూ బ్యూబ్ నటి), కౌశల్ (ఆర్టిస్ట్), తేజస్వి మదివాడ, గణేష్ (సామాన్యుడు), సంజనా అన్నే (సామాన్యురాలు) నూతన్ నాయుడు (సామన్యుడు)లు బిగ్‌బాస్‌లో పాల్గొననున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సస్పెన్స్ వీడింది.. 'బిగ్‌బాస్-2' హౌస్‌కు వెళ్లింది వీరే...