Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'గజ' బాధితులకు "2.O" యూనిట్ భారీ విరాళం...

'గజ' బాధితులకు
, బుధవారం, 21 నవంబరు 2018 (08:06 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ల కాంబినేషన్‌లో దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం 2.O. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చిన్నవార్త కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.
 
తాజాగా, తమిళనాడు రాష్ట్రంలోని ఆరు జిల్లాలను గజ తుఫాను అతలాకుతలం చేసింది. అపార ఆస్తినష్టం వాటిల్లింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో అనేక మంది ప్రముఖులు, సినీ సెలెబ్రిటీలు తమవంతుగా ఆర్థిక సాయం చేస్తున్నారు. 
 
ఈ కోవలో 2.O చిత్ర నిర్మాతలు ఏకంగా రూ.1.01 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. అలాగే, చిత్ర దర్శకుడు శంకర్ రూ.10 లక్షలు, హీరో రజినీకాంత్ 50 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిధ‌ర‌మ్ తేజ్ స్టార్ట్ చేసేసాడు... ఈసారైనా విజ‌యం ద‌క్కేనా..?