Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శవాలతో సెక్స్ చేసే పాడు రోగం.. అదే "దేవీశ్రీ ప్రసాద్" స్టోరీ (Trailer)

'దేవీశ్రీప్రసాద్'.... దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు కుర్రాళ్లు తమ జీవితంలో ఆడే ఆటను ప్రధానాంశంగా చేసుకుని నిర్మిస్తున్న చిత్రమే 'దేవిశ్రీప్రసాద్'. టైటిల్ రోల్స్‌లో మనోజ్ నందం, ధన్‌రాజ్ మరో కొత్త కు

శవాలతో సెక్స్ చేసే పాడు రోగం.. అదే
, గురువారం, 23 మార్చి 2017 (14:13 IST)
'దేవీశ్రీప్రసాద్'.... దేవి, శ్రీ, ప్రసాద్ అనే ముగ్గురు కుర్రాళ్లు తమ జీవితంలో ఆడే ఆటను ప్రధానాంశంగా చేసుకుని నిర్మిస్తున్న చిత్రమే 'దేవిశ్రీప్రసాద్'. టైటిల్ రోల్స్‌లో మనోజ్ నందం, ధన్‌రాజ్ మరో కొత్త కుర్రాడు నటిస్తున్నారు. వీరికి శవాలతో సెక్స్ చేసే ఓ పాడు రోగం ఉంటుంది. అదే నెక్రోఫీలియా. అంటే.. శవాలతో సెక్స్ చేసే పాడు బుద్ధి ఈ ముగ్గురు కుర్రాళ్ళదన్నమాట. 
 
హాలీవుడ్‌లో ఈ తరహా కథాంశాలతో చాలా సినిమాలే వచ్చాయి. తెలుగులో ఇప్పుడు ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్ తాజాగా విడుదల చేశారు. 'స్వామిరారా' సినిమా ఫేమ్ పూజా రామచంద్రన్.. ఈ సినిమాలో ఓ కీలక రోల్ పోషిస్తోంది. 
 
ఈ సినిమాలో ఆమె హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అయితే యాక్సిడెంట్‌లో ఆమె మరణిస్తుంది. శవాన్ని మార్చురీలో పెడితే.. శవంపై అత్యాచారానికి తెగబడతారు ఈ ముగ్గురు కుర్రాళ్లు. ఆర్వో క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్వీ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఒకటుందని నాకు తెలియదు : రకుల్ ప్రీత్ సింగ్