Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపికా నివాసముండే అపార్ట్‌మెంట్లో అగ్ని ప్రమాదం.. 95మంది సేఫ్

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే జోడి వివాహం చేసుకోనుందని బీటౌన్ గ

దీపికా నివాసముండే అపార్ట్‌మెంట్లో అగ్ని ప్రమాదం.. 95మంది సేఫ్
, బుధవారం, 13 జూన్ 2018 (17:08 IST)
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొనే జోడి వివాహం చేసుకోనుందని బీటౌన్ గుసగుసలాడుకుంటోంది. ఈ ఏడాది చివరికల్లా మూడుముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
అత్యంత సన్నిహితుల సమక్షంలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌‌కే ఈ జోడీ మొగ్గుచూపుతోందని.. వివాహానంతరం ముంబై, బెంగళూరులలో రెండు భారీ రిసెప్షన్‌‌లను కూడా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపికా పదుకునే నివాసం వుంటున్న ముంబయిలోని వర్లి ప్రాంతంలోని 45 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
 
33వ అంతస్తులో మంటలు చెలరేగడంతో దానిపై భాగంలో ఉన్న ఫ్లాట్‌లు కూడా దెబ్బతిన్నాయి. ఈ టవర్‌లోనే దీపికా పదుకునే ఫ్లాట్ కూడా వుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో వచ్చి మంటలు ఆర్పుతున్నారు. 95 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 
 
ఈ ఘటనపై దీపికా స్పందిస్తూ.. తాను సురక్షితంగా వున్నానని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారని ట్విట్టర్లో వెల్లడించింది. ఇంకా ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదని.. రెండు అంతస్తుల వరకు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''విరాటపర్వం 1992''లో విజయ్ దేవరకొండతో ఫిదా భామ?