Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా దేశానికి అపుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు : పరుచూరి గోపాలకృష్ణ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ సినీ కథా మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.

నా దేశానికి అపుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు : పరుచూరి గోపాలకృష్ణ
, మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:40 IST)
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ సినీ కథా మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేశ 71వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన ట్విట్టర్ ఖాతాలో మంగళవారం ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
"ప్రజా ప్రతినిధి గెలిచిన పార్టీలోనే ఎపుడు ఐదేళ్లు ఉంటారో.. ఎపుడు రోడ్లు మీద బిచ్చమెత్తుకునే వారు కనిపించరో, ఎపుడు బైటకు వెళ్లిన ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు బెంగ పెట్టుకోరో అపుడే నా దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు" అని ప్రముఖ సినీ కథ, మాటల రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 
 
అలాగే, జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కల్యాణ్ భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే విషయంపై ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. ‘వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు’ అని సోమవారం ఆయన ట్వీట్‌చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ తేజ వున్నాడే... రానా తండ్రికే వార్నింగిచ్చాడట... ఆ 3 చిత్రాలూ నెట్లో(వీడియో)