Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టిల్లూ హీరోయిన్ అనుపమను ఘోరంగా అవమానించిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

Anupama parameswaran

ఐవీఆర్

, మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (10:41 IST)
టిల్లూ స్క్వేర్ సక్సెస్ మీట్ నిన్న రాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఇంకా చిత్ర బృందాన్ని అభినందించేందుకు వచ్చినవారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యువహీరో విశ్వక్ సేన్ తదితరులు కూడా వచ్చారు. చిత్రంలో నటించిన హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తనకు దక్కిన సక్సెస్ గురించి చెప్పేందుకు స్టేజిపైకి ఎక్కి మాట్లాడాలనుకున్నది.
 
ఐతే మైకు అందుకుని మాట్లాడుతూ వుండగా... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెను మాట్లాడొద్దు మాట్లాడొద్దు అంటూ గట్టిగా గావుకేకలు పెట్టారు. ఎన్టీఆర్ స్టేజిపైకి వచ్చి మాట్లాడాలంటూ గోల చేస్తుండటంతో అనుపమ స్టేజి దిగి వెళ్లిపోబోయింది. ఇంతలో యాంకర్ సుమ... రెండు ముక్కలైనా మాట్లాడాలని అభ్యర్థించడంతో మరోసారి పరమేశ్వరన్ మాట్లాడేందుకు ప్రయత్నించబోగా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరిచారు.
 
ఇక చేసేది లేక టిల్లు హీరోయిన్ ఖిన్నురాలై స్టేజి దిగి వెళ్లిపోయిందట. నేరుగా వెళ్లి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆశీర్వాదాలు తీసుకుని నోరు మెదపకుండా తన సీట్లో కూర్చుండిపోయిందట ఈ లేడికళ్ల సుందరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవును.. మేమిద్దరం విడిపోయాం.. ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య