Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త‌ను చేయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ గురించి క‌ళ్యాణ్ రామ్ ఏమ‌న్నారంటే...?

టాలీవుడ్‌లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా ద‌గ్గ‌ర నుంచి మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైంది. ఆత‌ర్వాత వెంకీ - ప‌వ‌న్ క‌లిసి 'గోపాల గోపాల' సినిమా చేసారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి మ‌నం సినిమా చేసారు. ఇక నంద‌మూరి హీరోల మ‌ల్టీస్టా

త‌ను చేయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ గురించి క‌ళ్యాణ్ రామ్ ఏమ‌న్నారంటే...?
, గురువారం, 14 జూన్ 2018 (12:47 IST)
టాలీవుడ్‌లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమా ద‌గ్గ‌ర నుంచి మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ మ‌ళ్లీ మొద‌లైంది. ఆత‌ర్వాత వెంకీ - ప‌వ‌న్ క‌లిసి 'గోపాల గోపాల' సినిమా చేసారు. అక్కినేని ఫ్యామిలీ హీరోలు క‌లిసి మ‌నం సినిమా చేసారు. ఇక నంద‌మూరి హీరోల మ‌ల్టీస్టార‌ర్ కూడా రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇందులో హ‌రికృష్ణ‌, ఎన్టీఆర్ కూడా న‌టిస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.
 
కానీ... ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం నా నువ్వే. ఈ చిత్రం ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన క‌ళ్యాణ్ రామ్ త‌ను చేయ‌బోయే మ‌ల్టీస్టార‌ర్ గురించి కూడా చెప్పాడు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే.. ఇందులో న‌టించేందుకు ముగ్గురు న‌లుగురు హీరోల‌ను అనుకుంటున్నాం కానీ.. ఎవ‌రనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు అన్నారు. 
 
హీరోలు ఎవ‌ర‌నేది ఖ‌రారు అయిన త‌ర్వాత అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తామ‌ని తెలియ‌చేసారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పైన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించ‌నున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చికాగో కేంద్రంగా సెక్స్ స్కాండల్.. టాలీవుడ్ హీరోయిన్స్ అలా వెళ్లి...?