Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ పిలుపుతో వైజాగ్ వెళ్లిన వారిలో నేనూ ఉన్నా : కత్తి మహేష్

ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు అందుకుని వైజాగ్ వెళ్లిన వారిలో తానూ ఉన్నానని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా వెల్లడించారు.

పవన్ పిలుపుతో వైజాగ్ వెళ్లిన వారిలో నేనూ ఉన్నా : కత్తి మహేష్
, ఆదివారం, 21 జనవరి 2018 (16:19 IST)
ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు అందుకుని వైజాగ్ వెళ్లిన వారిలో తానూ ఉన్నానని సినీ విమర్శకుడు కత్తి మహేష్ తాజాగా వెల్లడించారు. 
 
ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. "ప్రత్యేక హోదా మాత్రమే కాదు. అన్ని విభజన హామీల గురించి పోరాడాల్సిన సమయం వచ్చింది. ఇలాగే ఆలస్యం చేస్తే, వాటికి చట్టబద్ధత నశించే ప్రమాదం ఉంది" అని పేర్కొన్నారు. 
 
కత్తి మహేష్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 'మేము పోరాడుతున్నాము, నువ్వు కూడా రా.. నీకు బాధ్యత లేదా, రాష్ట్రాన్ని కాపాడుకునే హక్కు లేదా, నీ వ్యక్తిగత హక్కు కోసం పోరాడుతావు, నీలో పోరాట పటిమ చాలా గొప్పది. రా.. మాతో కలిసిరా' అని జనసేన కార్యకర్త ఒకరు కామెంట్ చేయగా.. ‘‘పవన్ కళ్యాణ్ పిలుపుని అందుకుని వైజాగ్ వచ్చినవాళ్ళలో నేనూ ఉన్నాను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.’’ అంటూ కత్తి రిప్లయ్ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పద్మావత్‌'కు చిక్కులు... గుజరాత్ మల్టీప్లెక్స్ నిరాకరణ