Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైతూ పాదాలను ముద్దెట్టుకున్న అనూ.. సమ్మూపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. భర్త అక్కినేని నాగచైతన్య నటించిన ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాటను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మ

చైతూ పాదాలను ముద్దెట్టుకున్న అనూ.. సమ్మూపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్
, మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (18:20 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. భర్త అక్కినేని నాగచైతన్య నటించిన ''శైలజా రెడ్డి అల్లుడు'' సినిమా విడుదలకు సిద్ధంగా వుంది. తాజాగా ఈ సినిమాలో ఒక పాటను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. చైతు పాదాల దగ్గర ముద్దు పెట్టుకొనే షాట్ ఒకటి ఉంది. తన మోమును మొత్తం చైతు పాదాల మీద పెట్టి తన్మయత్వం పొందే సీన్ ఒకటి ఈ పాటలో కనిపిస్తోంది. ఈ సీన్ పట్ల మహేష్ ఫ్యాన్స్ సమంతని ప్రశ్నిస్తున్నారు. 
 
ఇందుకు కారణం ఏమిటంటే..? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'వన్ నేనొక్కడినే' సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదలైనప్పుడు సమంత ట్విట్టర్ వేదికగా ఆ పోస్టర్‌పై అసహనం వ్యక్తం చేసింది. అందులో మహేష్ బాబు నడుస్తూ వెళ్తుంటే ఆయన పాదాలు అచ్చులను చేతితో పట్టుకుంటూ హీరోయిన్ ఉండే పోస్టర్‌పై సమంత చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. 
 
అప్పట్లో సమంతపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ పోస్టర్ చూడగానే అంతగా రియాక్ట్ అయిన సమంత చైతూ ఇలాంటి సీన్‌లో నటిస్తుంటే ఏమంటుందోనని నిలదీశారు. ఇంకా అనూ, చైతూ పాట ఫోటోను పెట్టి సమంతను ట్రోల్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జపాన్‌లో రచ్చ చేస్తున్న 'మగధీర' : థాంక్యూ జపాన్... అంటూ చెర్రీ ట్వీట్