Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో ఐదో స్థానం... సౌతిండియాలో ఏకైక స్టార్ ప్రభాస్...

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే సమాధానం ప్రభాస్ అని. "బాహుబలి" చిత్రం తర్వాత జాతీయ స్థాయి హీరోనే కాదు.. ఇంటర్నేషనల్ స్థాయి హీరోగా మారిపోయారు. ఇపుడు మరో అరుదైన రికార్డును సొంతం

దేశంలో ఐదో స్థానం... సౌతిండియాలో ఏకైక స్టార్ ప్రభాస్...
, గురువారం, 23 ఆగస్టు 2018 (15:05 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే ఠక్కున చెప్పే సమాధానం ప్రభాస్ అని. "బాహుబలి" చిత్రం తర్వాత జాతీయ స్థాయి హీరోనే కాదు.. ఇంటర్నేషనల్ స్థాయి హీరోగా మారిపోయారు. ఇపుడు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
 
దేశంలో ఉన్న సూపర్‌స్టార్లలో ప్రభాస్ ఐదో స్థానంలో నిలిచాడు. సౌత్‌లోని ఇతర స్టార్లను దాటేసి భారీ ఫాలోయింగ్‌తో అతను ఈ స్థానం దక్కించుకున్నాడు. ప్రముఖ మీడియా సంస్థ ఇండియాటుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్-2018'ను ఇటీవల నిర్వహించింది. అందులో సెలబ్రిటీలు సాధించిన ఓట్లనుబట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. 
 
ఆ జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ల సరసన ప్రభాస్ నిలవడం విశేషం. ఈ పోల్‌లో డిఫరెంట్ కేటగిరీలున్నాయి. అందులో మేల్ సూపర్‌స్టార్ కేటగిరీలో ప్రభాస్ ఐదో ర్యాంక్ సాధించడం విశేషం. మొదటి స్థానంలో సల్మాన్‌ ఖాన్, రెండో స్థానంలో అక్షయ్ కుమార్ నిలిచారు. షారుఖ్‌ ఖాన్, రణబీర్‌ కపూర్‌లు మూడో స్థానాన్ని పంచుకోగా 'బిగ్ బి' అమితాబ్‌ బచ్చన్ నాలుగో స్థానం సాధించారు. 
 
ఇక ప్రభాస్, రణవీర్ సింగ్‌లు ఇద్దరూ సంయుక్తంగా ఐదో ర్యాంక్‌లో నిలిచారు. ఇక్కడ ప్రభాస్ ఘనత ఏమిటంటే… టాప్-5లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సౌత్ ఇండియన్ స్టార్ అతను కావడం విశేషం. ప్రభాస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్‌ను ఇది మరోసారి రుజువు చేసింది. మరోవైపు మోస్ట్ పాపులర్ ఫిమేల్ సూపర్‌స్టార్ విభాగంలో దీపిక పదుకునే, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మలు టాప్ ర్యాంక్ సాధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆదాశర్మ ఇలా మారిపోయిందేమిటి? రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటూ?