Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ హౌస్ సభ్యులకు నాని గట్టి వార్నింగ్.. ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ రెండో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. 16 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో చివరకు ఆరుగురు మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ మొదటి సీజన్‌తో పోలిస్తే రెండవ షో విభిన్నంగా నడిచిందని చెప్పాలి. రెండో సీజన్ మొదటి నుంచి హాట్ హాట్‌గానే జరుగుతోంది. హౌస్‌లో నిత్యం

బిగ్ బాస్ హౌస్ సభ్యులకు నాని గట్టి వార్నింగ్.. ఎందుకో తెలుసా?
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (20:05 IST)
బిగ్ బాస్ రెండో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. 16 మంది సభ్యులతో మొదలైన ఈ షోలో చివరకు ఆరుగురు మాత్రమే మిగిలారు. బిగ్ బాస్ మొదటి సీజన్‌తో పోలిస్తే రెండవ షో విభిన్నంగా నడిచిందని చెప్పాలి. రెండో సీజన్ మొదటి నుంచి హాట్ హాట్‌గానే జరుగుతోంది. హౌస్‌లో నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 
 
ఇంటి సభ్యులు చాలా హుందాగా ప్రవర్తించాల్సింది పోయి తమలో తాము గొడవలు పడుతూ ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తున్నారు. కౌశిక్, తనిష్‌‌ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. నాని వీరికి క్లాస్ పీకుతూనే ఉన్నారు. కానీ వీరిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. హౌస్ లోని వారందరూ కౌశల్‌ను టార్గెట్ చేయడం చూస్తేనే ఉన్నాం. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కూడా వీరిద్దరు గొడవ పడ్డారు.
 
వీరి గొడవలను వ్యక్తిగతంగా తీసుకోవడంతో బిగ్ బాస్ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హౌస్ లోని సభ్యులను కుక్కలతో పోలుస్తూ కౌశల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఈ గొడవ పెద్దది కావడంతో వారాంతంలో వచ్చే నాని వారం మధ్యలోనే రావాల్సి వచ్చింది. అయితే హౌస్‌కు నాని నేరుగా వెళ్ళి కుక్కల్లా మీరు అరిచే అరుపులు బిగ్ బాస్ షోను ప్రేక్షకులు చూడనీయకుండా చేస్తోంది. ఇప్పటికైనా దీన్ని మానుకోండంటూ చెబుతున్నాడట నాని.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను భాను.. బాక్స్ బద్దలైపోద్ది అంటూ సుడిగాలి సుధీర్‌ని ఒంగోబెట్టి...