Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నన్ను దోచుకుందువటే' షాక్‌లో సుధీర్ బాబు... అస‌లు ఏం జ‌రిగింది..?

న‌న్నుదోచుకుందువ‌టే సినిమాతో నిర్మాత‌గా మారాడు హీరో సుధీర్ బాబు. నూత‌న ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు తెర‌కెక్కించిన ఈ సినిమాకి రివ్యూ రైట‌ర్స్ చాలామంది మంచి రేటింగే ఇచ్చారు. సినీ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు, రాఘవేంద్ర‌రావు, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దిత‌రులు ఈ

'నన్ను దోచుకుందువటే' షాక్‌లో సుధీర్ బాబు... అస‌లు ఏం జ‌రిగింది..?
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:25 IST)
న‌న్నుదోచుకుందువ‌టే సినిమాతో నిర్మాత‌గా మారాడు హీరో సుధీర్ బాబు. నూత‌న ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు తెర‌కెక్కించిన ఈ సినిమాకి రివ్యూ రైట‌ర్స్ చాలామంది మంచి రేటింగే ఇచ్చారు. సినీ ప్ర‌ముఖులు మ‌హేష్ బాబు, రాఘవేంద్ర‌రావు, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దిత‌రులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. సినిమా కూడా చాలా స‌హ‌జంగా ఫ్యామిలీతో క‌లిసి చూసి ఆనందించేలా ఉంది. అయితే... క‌లెక్ష‌న్స్ మాత్రం రావ‌డం లేదు.
 
ఈ సినిమా 21న రిలీజైంది. ఆ రోజు హాలీడే. అయిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. పోనీ.. శ‌నివారం నుంచి బాగుంటాయి అనుకుంటే... శ‌నివారం, ఆదివారం కూడా ఏమాత్రం పుంజుకోలేదు. చిత్రం ఏంటంటే... గ‌త వారం రిలీజైన నాగ‌చైత‌న్య శైల‌జారెడ్డి అల్లుడు చిత్రానికి ఈవారం క‌లెక్ష‌న్స్ బాగున్నాయి. 
 
న‌న్నుదోచుకుందువ‌టే చిత్రానికి మెయిన్ థియేట‌ర్లో ఒక షోకి 20 వేలు వ‌స్తే.. శైల‌జారెడ్డి అల్లుడుకి 50 వేలు క‌లెక్ష‌న్స్ రావ‌డం విశేషం. వ‌చ్చే వారం నాగార్జున - నాని క‌లిసి దేవ‌దాస్ అంటూ వ‌చ్చేస్తున్నారు. ఇది చూసి సుధీర్ బాబు నిర్మించిన తొలి చిత్రం ఇలా అయ్యిందేంటి అని షాక్ అవుతున్నాడ‌ట‌.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళ అర్జున్ రెడ్డి టీజర్ ఎలా ఉందంటే...