Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై చేరుకున్న దీపిక - రణ్‌వీర్ దంపతులు

ముంబై చేరుకున్న దీపిక - రణ్‌వీర్ దంపతులు
, ఆదివారం, 18 నవంబరు 2018 (14:50 IST)
ఇటీవల మూడుముళ్ళబంధంతో ఒక్కటైన దీపిక పదుకొనే, రణ్‌వీర్ సింగ్‌లు ముంబైకు చేరుకున్నారు. వీరిద్దరి వివాహం తాజాగా ఇటలీలోని లేక్‌కోమోలో రెండు రోజుల క్రితం జరిగిన విషయం తెల్సిందే. న‌వంబ‌ర్ 14వ తేదీన కొంక‌ణి వివాహ ప‌ద్ద‌తిలో వీరి పెళ్లి వేడుక జ‌రుగ‌గా, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. త‌మ పెళ్లికి సంబంధించి ఏ ఒక్క ఫోటో కూడా బ‌య‌ట‌కి రాకుండా చాలా సీక్రెట్‌గా వీరి వివాహం జ‌రిగింది. 
 
ఈ క్రమంలో ఆదివారం ఉదయం దీప్‌-వీర్ దంప‌తులు ముంబై చేరుకోగా ఎయిర్ పోర్ట్‌లో నూత‌న దంప‌తుల‌కి అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆ త‌ర్వాత ర‌ణ్‌వీర్ ఇంటి వ‌ద్ద కూడా అభిమానులు గుమికూడ‌గా వారికి దీప్‌వీర్‌లు బయటకు వచ్చి వారికి అభివంద‌నం చేశారు. 
 
నూత‌న దంప‌తులు ఇద్ద‌రు బంగారు వర్ణపు దుస్తుల్లో మెర‌వ‌డం విశేషం. ఈ నెల 21వ తేదీన బెంగళూరులో, 28వ తేదీన ముంబైలో వివాహ విందును ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత ఎప్పటిలా తమ సినీ కెరీర్‌పై దృష్టిసారించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంకా చోప్రా ప్రియుడుకి టైప్ 1 డయాబెటిస్