Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిఖిల్ స్పై నాన్-థియేట్రికల్ హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయి

Nikhil Siddhartha
, గురువారం, 6 ఏప్రియల్ 2023 (17:13 IST)
Nikhil Siddhartha
నిఖిల్ తన మిషన్ ను స్పైతో  ప్రారంభించాడు. ఇప్పటివరకు రాణి మార్కెట్ ఆయనకు ఈ సినిమాతో వచ్చేసింది. కార్తికేయ 2 సినిమాతో  నిఖిల్ సిద్ధార్థ భారతదేశం అంతటా విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు, ఉత్తరాదిలో తన కొత్త కీర్తిని ఏకీకృతం చేసే ప్రయత్నంలో, అతను తన ప్రతిష్టాత్మకమైన తదుపరి స్పై చిత్రాన్ని బహుళ భాషా థ్రిల్లర్‌గా విడుదల చేయబోతున్నాడు. 2021లో స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రకటించబడిన స్పై సినిమాకు  ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వ అరంగేట్రం చేస్తున్నారు. తను ఎడిటర్‌గా గూడాచారి, ఎవరు, హెచ్‌ఐటి ఫ్రాంచైజీ వంటి చిత్రాలను చేసాడు. 
 
 నిఖిల్  స్పై నాన్-థియేట్రికల్ హక్కులు 40 కోట్లకు అమ్ముడయ్యాయని నిర్మాణ సంస్థ ప్రకటనలో తెలిపింది. పూర్తి యాక్షన్‌తో కూడిన గూఢచారి థ్రిల్లర్‌గా రూపొందుతున్న స్పైలో నిఖిల్ సరసన ఈశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుండగా, హాలీవుడ్ టెక్నీషియన్ జూలియన్ అమరు ఎస్ట్రాడా సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రానికి కథ అందించిన కె రాజ శేఖర్ రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలో అభినవ్ గోమతం, సన్యా ఠాకూర్, జిషు సేన్ గుప్తా, నితిన్ మెహతా, రవివర్మ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వేసవిలో థియేటర్లలోకి వస్తుందని తెలియజేసారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెట్రిమారన్ విడుతలై పార్ట్ 1 ఏప్రిల్ 15న రిలీజ్ కానుంది